ఆచార్య సెట్ ని షేర్ చేసిన మెగాస్టార్ ?
1 min read
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’, శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. కొరాటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో భారీ టెంపుల్ టౌన్ సెట్ వేశారు. భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 20 ఎకరాల్లో ఈ సెట్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోతో పాటు, దానికి సంబంధించిన వివరాలను చిరు తన అభిమానుల కోసం వివరించారు. ‘ఆచార్య సినిమా కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్. 20 ఎకరాల విస్తీర్ణంలో వేయడం జరిగింది. అందులో భాగంగా గాలి గోపురం… ఆశ్చర్యం గొలిపేలా ప్రతి దాన్ని అద్భుతంగా మలిచారు.
The amazing #TempleTown set built for #Acharya is a real piece of Art. Couldn't stop sharing it with you all. pic.twitter.com/P4psg5TDVn
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 6, 2021